.https://drive.google.com/file/d/0BztXX1SBCx0tTlJ1VjZCQllfWFk/view?usp=sharing
Blog of All India BSNL/DoT Pensioners Association, Andhra Pradesh Circle Maintained by: Com P.Asokababu, Vice President, AIBDPA(CHQ) mobile 9440750111 AIBDPA Andhra Pradesh Circle Circle President: Com V.Sambasiva Rao(mobile 9441265544) Circle Secretary:Com Ramachandrudu (mobile 9440774433) Circle Treasurer: Com K.Narasimha Rao (mobile 9441091386)
Saturday, 23 July 2016
పెన్షన్ బాధ్యత ప్రభుత్వానికి 60 శాతమే అనే నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఆర్డర్సు -మన ఐక్య పోరాటం సాధించిన ఘన విజయం
.https://drive.google.com/file/d/0BztXX1SBCx0tTlJ1VjZCQllfWFk/view?usp=sharing
Friday, 22 July 2016
27.7.2016న విజయోత్సవం జరపండి
DoT's Orders on 78.2% DA merger for pensioners
Monday, 18 July 2016
Orders issued on 78.2% DA merger for pensioners
Thursday, 7 July 2016
WE ARE REALLY HUMBLED; THANKS A LOT COMRADES
Tuesday, 5 July 2016
ఎట్టకేలకు 78.2% డి ఎ మెర్జర్ కు కేబినెట్ ఆమోదం
Government of India
Cabinet
05-July-2016 17:20 IST
Background:
The decision of the Cabinet has come in the wake of an anomalous situation created in the difference of pension formula among the BSNL retirees who retired before and after 10.06.2013. Further, the decision regarding pensionary liability is on persistent demand from various quarters and a series of deliberations at different levels to fulfill the assurance given by the Government before corporatization i.e. before formation of BSNL.
Monday, 20 June 2016
78.2 శాతం డి ఏ మెర్జర్ - కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించబడిన కేబినెట్ నోట్
Tuesday, 14 June 2016
జోహార్ కా.ఎం.పి.కున్హనందన్
Monday, 13 June 2016
78.2 శాతం డి ఎ మెర్జర్- కేబినెట్ నోట్ పై సంతకం చేసిన డి ఓ టి సెక్రెటరీ- కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించేందుకు జరుగుతున్న సన్నాహం
ఈ రోజు ( 13.6.2016) ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ , డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ తో 78.2 శాతం డి ఎ మెర్జర్ విషయం మాట్లాడారు.
కేబినెట్ సెక్రెటేరియట్ సూచన మేరకు మార్పు చేయబడిన కేబినెట్ నోట్ ను డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ఈ రోజు ఆమోదించారని శ్రీ జైన్ తెలియజేశారు. మార్చబడిన ఈ కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం, అదనంగా పంపించాల్సిన కాపీలు తదితరాలను తయారు చేస్తున్నామని, ఈ పని అయినతరువాత కవరింగ్ లెటరు సంతకానికి డి ఓ టి సెక్రెటరీకి పంపిస్తామని, ఆ తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని శ్రీ జైన్ అన్నారు.
ఇప్పటికే 3 సంవత్సరాలయిందని, కొంతమంది పెన్షనర్లు ఈ బెనిఫిట్ లభించకుండానే చనిపోవటం కూడా జరిగిందని, కాబట్టి ఇంకా ఆలస్యం జరగకుండా చూడాలని కా. జయరాజ్, శ్రీ జైన్ కు విజ్ఞప్తి చేశారు. పని త్వరగాఅయ్యేందుకు సాధ్యమయినదంతా చేస్తామని శ్రీ జైన్ హామీ యిచ్చారు.
Wednesday, 8 June 2016
సెక్రెటరీ డి ఓ టి ఢిల్లీలో లేనందున ఆగిన 78.2 శాతం డి ఏ ఫైలు
Wednesday, 1 June 2016
7వ వేతన సంఘం సిఫార్సులపై ప్రభుత్వ వైఖరి-పెన్షనర్లు
26.5.2016 న కేబినెట్ సెక్రెటరీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ( కా. శివ గోపాల్ మిశ్రా, కా. గుమన్ సింగ్, కా.కె.కె.ఎన్.కుట్టి) కలిశారు. కేబినెట్ సెక్రెటరీ తో జరిపిన ఈ చర్చలు నిరాశాజనకముగా వున్నాయి. ప్రభుత్వము కనీస వేతనం ను రు.18000 నుండి స్వల్పముగా పెంచేందుకు సిద్ధముగా వున్నది. కానీ ఫిట్మెంట్ ఫార్ములాని 2.57 నుండి పెంచేందుకు సిద్ధముగా లేదు.
ఇంతేగాక 7 వ వేతన సంఘం పాత పెన్షనర్ల పెన్షన్ కొత్త పెన్షనర్లతో సమముగా వుండాలని సిఫార్సు చేసినప్పటికీ ఇందుకు అంగీకరించేందుకు ప్రభుత్వము సిద్ధముగా లేదు. ఈ సిఫార్సు అమలు చేయటం సాధ్యం కాదని, పాత పెన్షనర్ల రికార్డులు దొరకటం కష్టం కాబట్టి సాధ్యము కాదని పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అన్నట్లు కేబినెట్ సెక్రెటరీ అన్నారు. కానీ ఇది అర్థం లేని వాదన. పెన్షనర్ల రికార్డులు సంబంధిత డిపార్ట్మెంట్సు వద్ద వుంటాయి. ఇంతే గాక పెన్షనర్ల వద్ద కూడా చాలా వరకు వుంటాయి. రికార్డులు దొరకటం కష్టమనే పేరుతో పెన్షన్ సమానతను నిరాకరించే ప్రయత్నం ను మనం ఆమోదించ కూడదు.
ప్రభుత్వ వైఖరి సానుకూలముగా లేనందున డిమాండ్స్ పై కూలంకషముగా చర్చించేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కోరారు. పాత పెన్షనర్లకు కొత్త పెన్షనర్లతో సమానత వుండాలని 7వ వేతన సంఘం సిఫార్సు చేసినా అంగీకరించకపోవటం సమంజసం కాదని ఉద్యోగుల ప్రతినిధులన్నారు. తాను ఈ విషయములో పునఃపరిశీలనకు సిద్ధమేనని, ఒక సారి పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అధికారులతో చర్చించండని కేబినెట్ సెక్రెటరీ సలహా యిచ్చారు.
3.6.2016 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీ లో సమావేశమై పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుంది.
పెన్షనర్లకు ఈ విషయాలు తెలియ జెసి అవసరమయిన సందర్భములో పోరాటానికి సంసిద్ధం చేయాలని ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్) సెక్రెటరీ జనరల్ కా. కె.కె.ఎన్.కుట్టి పిలుపునిచ్చారు. ఎన్ సి సి పి ఏ లో ఏ ఐ బి డి పి ఏ భాగస్వామి. కాబట్టి ఈ పిలుపుననుసరించి ఈ విషయాలు పెన్షనర్ల దృష్టికి తీసుకెళ్లాలి.
78.2 శాతం డి ఏ మెర్జర్ --1.6.2016 నాటి పరిస్థితి
Saturday, 14 May 2016
78.2 శాతం డి ఏ మెర్జర్
Thursday, 21 April 2016
78.2% డి ఎ మెర్జర్- కేబినెట్ ఆమోదానికి పంపంచేందుకు తయారు చేయబడుతున్న కేబినెట్ నోట్
ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ 21.4.2016 న డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ ను కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై చర్చించారు. మంత్రి నుండి కేబినెట్ నోట్ ఫైలు తిరిగి వచ్చిందని , ఆ కేబినెట్ నోట్ కు అనుబంధంగా పంపించాల్సిన పత్రాలను ( కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం మరియు సంబంధిత డాక్యుమెంట్లుఒక్కొక్కటి 50 కాపీలు) తయారు చేస్తున్నామని, డి ఓ టి లో వున్న పెన్షన్ సెక్షన్ ఈ పనిచేస్తున్నదని శ్రీ జైన్ అన్నారు. హిందీ అనువాదాన్ని హిందీ సెక్షన్ చేస్తున్నదని అన్నారు.
కేబినెట్ నోట్ తయారీ మొదటినుండీ చూస్తున్న డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచిస్ ఖన్నా సెలవులో వున్నారు. 28.4.2016 న జాయిన్ అవుతారు. కాబట్టి కా. జయరాజ్, ఏడిజి పెన్షన్ ను కలిసి కేబినెట్ నోట్ ను త్వరగా పంపించామని కోరారు. పని ఇప్పటికే ప్రారంభించామని, కొద్ది రోజులలో పూర్తి అవుతుందని అన్నారు. అనంతరం కా.జయరాజ్, హిందీ అధికారులను కలిశారు. హిందీ అనువాదం 25 వ తేదీ నాటికి పూర్తి కావచ్చని వారు తెలియజేశారు.
కాబట్టి ఏఐబిడిపిఏ కృషి వలన కొద్ది రోజులలోనే కేబినెట్ నోట్ ను డి ఓ టి ఆమోదానికిపంపించే పరిస్థితి ఏర్పడింది.
Tuesday, 12 April 2016
శుభ వార్త- 78.2% డి ఏ మెర్జర్ పై నిర్ణయం ఈ నెల ఆఖరులో గా వెలువడవచ్చు
Sunday, 3 April 2016
8.2% డి ఏ మెర్జర్ పై డి ఓ టి సెక్రటరీతో సమావేశం
Monday, 7 March 2016
78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు 10.3.2016న ప్రదర్శనలు నిర్వహించండి
Tuesday, 1 March 2016
78.2% డి ఎ మెర్జర్
Monday, 29 February 2016
డి ఓ టి పెన్షన్ ఖర్చు
2015-16 బడ్జెట్ అంచనా: రు. 6833.02 కోట్లు
2015-16 సవరించిన అంచనా--రు.7700 కోట్లు
2016-17 బడ్జెట్ అంచనా-----రు.8932 కోట్లు
2006-07 లో ఈ ఖర్చు ఆర్యూ. 1395 కోట్లు కాగా 2011-12 లో రు .3959 కోట్లు అయింది. రిటైరయిన వారి సంఖ్య పెరుగుతున్నందున పెన్షన్ ఖర్చు పెరుగుతున్నది.
2011-12 నుండి పెన్షన్ ఖర్చు డి ఓ టి కి బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించే పన్నులు, డివిడెండ్లు లో 60 శాతం దాటిందని డి ఓ టి అన్నది. కేబినెట్ ఆదేశం తో గతం లో డి ఓ టి ఇచ్చిన ఆర్డరు ప్రకారం డి ఓ టి కి బి ఎస్ ఎన్ ఎల్ పన్నులు, డివిడెండ్లు రూపం లో చెల్లించే మొత్తం లో పెన్షన్ ఖర్చు 60 శాతం మించితే మించిన భాగాన్ని బి ఎస్ ఎన్ ఎల్ భరించాలి. దీనిని వ్యతిరేకిస్తున్నాము. మొత్తం ఖర్చు డి ఓ టి యే (ప్రభుత్వమే) భరించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఆర్డర్ ను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ కు రాసేందుకు డి ఓ టి అంగీకరించింది.
Tuesday, 23 February 2016
78.2% డి.ఏ మెర్జర్
Friday, 19 February 2016
బి ఎస్ ఎన్ ఎల్ ఇయు విస్తృత కేంద్ర కార్యవర్గ సమావేశం
Monday, 15 February 2016
NCCPA & NJCA CIRCULARS
Saturday, 13 February 2016
కా.ఎస్.కె.వ్యాస్ ప్రథమ వర్థంతి
Thursday, 11 February 2016
782.శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ కు ఆర్డర్సు ఇవ్వాలని కోరుతూ మార్చి 10 న ప్రదర్శనలు నిర్వహించండి
Wednesday, 10 February 2016
7వ వెరిఫికేషన్ లో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అఖండ విజయం చేకూర్చేందుకు ఏ ఐ బి డి పి ఏ శాఖలు, సభ్యులు కృషి చేయాలి
Tuesday, 9 February 2016
బి ఎస్ ఎన్ ఎల్ ను, పెన్షన్ ను కాపాడుకునేందుకు ఉద్యమించుదాం
11.4.2016 నుండి కేంద్ర ప్రభుత్వోద్యోగుల నిరవధిక సమ్మె
Monday, 8 February 2016
కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినోత్సవం 13.2.2016
ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13ను కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినం గా పాటించాలని నవంబరు 2015 లో కలకత్తాలో జరిగిన ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్) అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడిన ఈ సందర్భములో కా.ఎస్.కె.వ్యాస్ మన మధ్య లేకపోవటం దురదృష్టకరం. మొదటి వేతన సంఘం నుండి 7వ వేతన సంఘం వరకు అన్నీ వేతనసంఘాలతో కా.ఎస్.కె.వ్యాస్ అనుబంధం కలిగి వున్నారు. వేతన సంఘాలతో మరియు పాలకులతో కా.ఎస్.కె.వ్యాస్ తన సహజ మేధాశక్తితో, విజ్ఞతతో చర్చించారు. భారత దేశ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు కా.ఎస్.కె.వ్యాస్ తిరుగులేని నాయకుడు. వారికి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. కేంద్ర ప్రభుత్వాలు డి ఏ ని లేదా వేతనాలని స్తంభింపజేయాలని చూసినప్పుడు జె సి ఏం స్టాండింగ్ కమిటీలో కా. ఎస్.కె.వ్యాస్ ఒంటరి కంఠ స్వరం ఇప్పటికీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది, మనల్ని ప్రభుత్వ దాడులకు వ్యతిరేకముగా పోరాడేందుకు ప్రోత్సహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఉద్యమాన్ని కార్మికోద్యమముతో మిళితం చేసేందుకు కా.ఎస్.కె.వ్యాస్ నిర్వహించిన పాత్ర అమోఘం. నయా ఉదారవాద ఆర్థిక విధానాల దాడులకు వ్యతిరేకముగా కార్మిక వర్గ కేంద్ర ట్రేడ్ యూనియన్లతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలను ఒకే వేదిక పైకి తీసుకు రావటం లో కా.వ్యాస్ నిర్వహించిన పాత్ర ఎల్లప్పుడు గుర్తుంచుకోతగినది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అత్యున్నత సంస్థ ఎన్ సి సి పి ఏ ని ఏర్పాటు చేసినది కా.ఎస్.కె.వ్యాస్.
13.2.2016న కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినాన్ని సమావేశాలు నిర్వహించటం ద్వారా అమలు చేయాలని ఎన్ సి సి పి ఏ పిలుపునిస్తున్నది.
కె.కె.ఎన్.కుట్టి
సెక్రెటరీ జనరల్, ఎన్ సి సి పి ఏ
13.2.2016న కా. ఎస్.కె.వ్యాస్ సంస్మరణార్థం సమావేశాలు జరిపి ఆయన చేసిన సేవలను సంస్మరించుకోవాలని, దానితోపాటు తిరుపతిలో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ పై నివేదికను ఇచ్చి మహాసభ చేసిన తీర్మానాలను వివరించాలని ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ శాఖ అన్ని జిల్లా శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నది
అభినందనలతో
రామచంద్రుడు, సర్కిల్ కార్యదర్శిఏ ఐ బి డి పి ఏ











