78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ కు ఆర్డర్సు ఇవ్వాలని కోరుతూ మార్చి 10 న ప్రదర్శనలు జరపాలని ఫిబ్రవరి 2,3 తేదీలలో తిరుపతిలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది. న్యాయ మంత్రిత్వ శాఖ నుండి కేబినెట్ నొత్ డి ఓ టి కి వచ్చింది. దాని పై ప్రాసెస్ జరుగుతున్నది. డి ఓ టి సెక్రెటరీ మరియు మంత్రి ఆమోదం అనంతరం కేబినెట్ కు పంపిస్తామని హామీ యిచ్చారు. ఫైలు త్వరగా వెళ్ళి కేబినెట్ ఆమోదం లభించేందుకు ఏ ఐ బి డి పి ఏ ప్రయత్నిస్తున్నది. డి ఓ టి మరియు ప్రభుత్వము పై ఒత్తిడి కొనసాగించేందుకు మార్చి 10న ప్రదర్శనలకు ఏ ఐ బి డి పి ఏ పిలుపునిచ్చింది. ఈ ప్రదర్శనలను జయప్రదముగా నిర్వహించండి.
No comments:
Post a Comment