డి ఓ టి మరియు ప్రభుత్వము 78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ ను అనవసరముగా జాప్యం చేస్తున్నాయి. ఈ జాప్యానికి కారణం లేదు. ఫైలు డి ఓ టి లో ఒక డెస్క్ నుండి మరో డెస్క్ కు తిరుగుతూ వున్నది. ఫైలును కేబినెట్ ఆమోదానికి త్వరలో పంపిస్తామనే హామీలు పుష్కలముగా లభిస్తున్నాయి. కానీ ప్రతి సారి ఏదో ఒక కొత్త సందేహాన్ని లేవనెత్తి ఫైలును డి ఓ టి లోనే అటు ఇటు తిప్పుతున్నారు. ఈ వివక్షతకి అన్యాయానికి ముగింపు పలకాలి. 10.6.2013 ముందు రిటైరయిన పెన్షనర్లకు 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ వెంటనే జరగాలి. ఫిబ్రవరి 2,3 తేదీలలో తిరుపతిలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ మార్చి 10 న ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మార్చి 10 న బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లు పెద్ద ఎత్తున బి ఎస్ ఎన్ ఎల్ జిల్లా కార్యాలయాల వద్దా జరుగు ప్రదర్శనలో పాల్గొనాలి. బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ల అసోసియేషన్ల ఫోరం కూడా అదే రోజు ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకించేందుకు, బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణకు మరియు 78.2 శాతం డి ఏ మెర్జర్ కు ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కాబట్టి పెన్షనర్లు కూడా ఈ ప్రదర్శనలలో పాల్గొని జయప్రదం చేయాలి.
No comments:
Post a Comment