Wednesday, 10 February 2016

7వ వెరిఫికేషన్ లో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అఖండ విజయం చేకూర్చేందుకు ఏ ఐ బి డి పి ఏ శాఖలు, సభ్యులు కృషి చేయాలి

2016 మే 10 న బి ఎస్ ఎన్ ఎల్ లో 7వ సారి యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దేన్నికలలో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అఖండ విజయం చేకూర్చేందుకు కృషి చేయాలని తిరుపతి లో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిలా భారత మహాసభ పిలుపునిచ్చింది. ఏ ఐ బి డి పి ఏ శాఖలు, సభ్యులు అందరూ ఇందుకు తగిన విధముగా బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అన్నీ విధాలా మద్దతునివ్వాలి. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులలో తమకి తెలిసిన వారందరికి బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కి వోటు వేయాలని చెప్పాలి. బి ఎస్ ఎన్ ఎల్ ను, పెన్షన్ ను కాపాడేందుకు ఐక్యపోరాటం మరింత బలపడాలన్నా, కార్మిక వర్గాన్ని, పెన్షనర్లను ఇబ్బందులపాలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకముగా కార్మిక వర్గ ఐక్య పోరాటం బలపడాలన్నా, బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు 1 మరియు పెన్షనర్లకు 1.1.2017 నుండి వేతన సవరణ, పెన్షన్ సవరణ జరగాలన్నా మే 10న జరుగు యూనియన్ గుర్తింపు ఎన్నికలలో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు 50 శాతం పైగా వోట్లు వచ్చి ఏకైక గుర్తింపు యూనీయంగా గెలవటం అవసరం. ఇందుకు పెన్షనర్లందరు కృషి చేయాలి. 

No comments:

Post a Comment