Saturday, 23 July 2016

పెన్షన్ బాధ్యత ప్రభుత్వానికి 60 శాతమే అనే నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఆర్డర్సు -మన ఐక్య పోరాటం సాధించిన ఘన విజయం

బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు అనేక పోరాటాలు చేసిన అనంతరం ఎట్టకేలకు ప్రభుత్వము పెన్షన్ ఖర్చు విషయం లో తన బాధ్యత బి ఎస్ ఎన్ ఎల్ పన్నులు, ఛార్జీలు రూపం లో తనకు చెల్లించే మొత్తం లో 60 శాతమే ననే ఆర్డరును రద్దు చేసింది. ఇది ఐక్య పోరాటం సాధించిన ఘన విజయం. ఈ పోరాటం లో బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు మరియు ఏ ఐ బి డి పి ఏ లు కీలక పాత్ర వహించాయి. ఈ 60 శాతం ఆర్డరు రద్దు వలన డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్ల పెన్షన్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసులో వున్న ఉద్యోగులకు పెన్షన్ కంత్రీబ్యూషన్ చెల్లిస్తే సరిపోతుంది. పెన్షన్ రివిజన్ చేయాల్సిన సందర్భముగా పెన్షన్ ఖర్చు 60 శాతం దాటిందా లేదా అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశ్నలు వేసి పెన్షన్ రివిజన్ త్వరగా జరగకుండా చేసే పరిస్తితి, పెన్షన్ చెల్లింపుకు ఇబ్బంది కలిగే పరిస్తితి ఇక వుండదు. ఈ ఆర్డరు కాపీని ఇక్కడ క్లిక్ చేసి చూడండి
.https://drive.google.com/file/d/0BztXX1SBCx0tTlJ1VjZCQllfWFk/view?usp=sharing

No comments:

Post a Comment