Monday, 13 June 2016

78.2 శాతం డి ఎ మెర్జర్- కేబినెట్ నోట్ పై సంతకం చేసిన డి ఓ టి సెక్రెటరీ- కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించేందుకు జరుగుతున్న సన్నాహం

ఈ రోజు ( 13.6.2016) ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ , డి ఓ టి లో డిడిజి   ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ తో 78.2 శాతం డి ఎ మెర్జర్ విషయం మాట్లాడారు. 

కేబినెట్ సెక్రెటేరియట్ సూచన మేరకు మార్పు చేయబడిన కేబినెట్ నోట్ ను డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ఈ రోజు ఆమోదించారని శ్రీ జైన్ తెలియజేశారు. మార్చబడిన ఈ కేబినెట్ నోట్ కు  హిందీ అనువాదం, అదనంగా పంపించాల్సిన కాపీలు తదితరాలను తయారు చేస్తున్నామని, ఈ పని అయినతరువాత కవరింగ్ లెటరు సంతకానికి డి ఓ టి సెక్రెటరీకి పంపిస్తామని, ఆ తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని శ్రీ జైన్ అన్నారు. 

ఇప్పటికే 3 సంవత్సరాలయిందని, కొంతమంది పెన్షనర్లు  ఈ బెనిఫిట్ లభించకుండానే చనిపోవటం కూడా జరిగిందని, కాబట్టి ఇంకా ఆలస్యం జరగకుండా చూడాలని కా. జయరాజ్, శ్రీ జైన్ కు విజ్ఞప్తి చేశారు. పని త్వరగాఅయ్యేందుకు సాధ్యమయినదంతా చేస్తామని శ్రీ జైన్ హామీ యిచ్చారు. 

 

No comments:

Post a Comment