Thursday, 7 January 2016

పెన్షనర్లకు 78.2% డి ఏ మెర్జర్ పై డి ఓ టి సెక్రెటరీ ని కలిసిన ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జయరాజ్



21.12.2015న ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ  కా. కె.జయరాజ్, డి ఓ టి సెక్రెటరీ శ్రీ రాకేశ్ గార్గ్ ను కలిసి 78.2% డి ఏ మెర్జర్ పై చర్చించారు. కేబినెట్ నోట్ పై డి ఓ టి లీగల్ అడ్వైజర్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తరని, కాబట్టి వీటిని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపించామని అన్నారు. (ఈ అభ్యంతరాలు సమస్యతో ఏ మాత్రము సంబంధము లేనివి. బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసులు బాగా లేవని, బి ఎస్ ఎన్ ఎల్ కు ఖాళీ స్థలాలు వున్నాయని తదితర అనవసరమయిన విషయాలు ఈ అభ్యంతరాలు). డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ అడిగిన ప్రశ్నలకు జవాబు తయారు చేశామని, న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఫైల్ తిరిగి రాగానే కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. ఈ సమస్య సాధ్యమయినంత త్వరలో పరిష్కారమయ్యేందుకు ఏ ఐ బి డి పి ఏ మరియు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కృషి చేస్తున్నాయి.  

No comments:

Post a Comment