Thursday, 7 January 2016

తిరుపతి లో 2,3 ఫిబ్రవరి 2016 న ఏ ఐ బి డి పి ఏ 2వ అఖిల భారత మహాసభలు


ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ (ఏ ఐ బి డి పి ఏ) 2వ అఖిల భారత మహాసభలు తిరుపతిలో  కా.ఎస్.కె.వ్యాస్ నగర్  (శ్రీరామ తులసి కళ్యాణమండపం, ఏ పి ఎస్ ఆర్ టి సి బస్ స్టాండ్ వద్ద) లో  జరగబోతున్నాయి. ఏ ఐ బి డి పి ఏ అభ్యర్థన మేరకు  ఈ మహాసభలు ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మరియు ఏఐబీడీపీఏ ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ శాఖలు నిర్ణయించాయి. కా. జె.సంపత్ రావు సర్కిల్ సెక్రెటరీ బిఎస్ ఎన్ ఎల్ ఈ యు మరియు కా.రామచంద్రుడు సర్కిల్ సెక్రెటరీ ఏ ఐ బి డి పి ఏ  నాయకత్వములో ఇందుకు తగిన ఏర్పాట్లను రెండు సర్కిల్ శాఖలు చేస్తున్నాయి. శాసన మండలి సభ్యులు  శ్రీ వై.శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షులుగా , బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు చిత్తూరు జిల్లా కార్యదర్శి కా.వై.ఎస్.రాజు జనరల్ సెక్రెటరిగా , ఏ ఐ బి డి పి ఏ చిత్తూరు జిల్లా కార్యదర్శి  కా. ఏం. రాజారెడ్డి జాయింట్ జనరల్ సెక్రెటరిగా మరియు కా. ఎస్.ఏం.షరీఫ్ ట్రెజరర్ గా  ఆహ్వాన సంఘం ఏర్పడి పని చేస్తున్నది.
1.2.2016 సాయంత్రం 4 గం.కు ఏ ఐ బి డి పి ఏ కేంద్ర కార్యవర్గ సమావేశం తిరుపతిలో జరుగుతుంది. ఫిబ్రవరి 2,3 తారీఖులలో మహాసభ జరుగుతుంది. మహాసభని పార్లమెంటు సభ్యులు మరియు సి ఐ టి యు ఉపాధ్యక్షులు అయిన శ్రీ టి.కె.రంగరాజన్ ప్రారంభిస్తారు.  మహాసభ ఎజెండా:
1. 4.2.2013 నుండి 1.2.2016 వరకు ఏ ఐ బి డి పి ఏ కార్యకలాపాలపై నివేదిక, దాని పై చర్చ, ఆమోదం
2. 2012-13, 2013-14 మరియు 2014-15 సంవత్సరాలకు సంబంధించిన ఆడిటెడ్ ఏకవుంట్స్ సమర్పణ, చర్చ, ఆమోదం
3. నిర్మాణ విషయాలు
అ) కేంద్రం/సర్కిల్సు/జిల్లా శాఖల పని విధానం
ఆ) ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినాషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్)
ఇ) టి యు ఐ (పి & ఆర్) [ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్-పెన్షనర్స్ అండ్ రిటైర్డ్]
4. పెండింగ్ సమస్యలు
* పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం రద్దు (పెన్షన్ చెల్లింపును ప్రయివేటు పరమ్ చేసే చట్టం రద్దు)
* బి ఎస్ ఎన్ ఎల్ పునరుద్ధరణ
* బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు 78.2% డి ఏ మెర్జర్
* పెన్షన్ అనామలి (1) బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడిన 10 నెలలలోపు రిటరాయిన వారి అనామలి (2) 1.10.2000 న జరిగిన పే రివిజన్ లో సీనియర్లకు తక్కువ జూనియర్లకు ఎక్కువ వచ్చిన కేసులు
* బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు క్వార్టర్లి మెడికల్ అలవెన్సు పునరుద్ధరణ
* పెన్షనర్లకు స్టాఫ్ క్వార్టర్సు అద్దె ను బేసిక్ పెన్షన్ లో 10 శాతానికి పరిమితం చేయటం
* డి ఓ టి పెన్షనర్లకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కన్సెషన్ వర్తింపు
* గ్రేడ్ 4 ప్రమోషన్ కు బదులు ఇవ్వాల్సిన ఇంక్రిమెంటు
* ఆఖరు ఇంక్రిమెంటు తరువాత సంవత్సర కాలం సర్వీసు చేసిన వారు తదుపరి  ఇంక్రిమెంటు తేదీ నాటికి సర్వీసులో లేకున్నా ఇంక్రిమెంటు ఇవ్వటం
5. 7వ వేతన సంఘం నివేదిక
6. పెన్షన్ కోసం 50% ఐ డి ఏ మెర్జర్
7. 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు జరిగే పే రివిజన్ తో పాటు పెన్షనర్లకు పెన్షన్ రివిజన్
8. అసోసియేషన్ బై లాస్ కు సవరణలు
* అసోసియేషన్ జీవిత కాల సభ్యత్వ రుసుము రు5000/- నుండి రు.1000 కి పెంచటం, సభ్యత్వ రుసుము సంవత్సరానికి రు.100 /- నుండి రు.200/- కి పెంచటం  
* అసోసియేటెడ్ సభ్యుల వార్షిక సభ్యత్వం రు.50/- నుండి రు. 100/- కి పెంచటం (ఫ్యామిలీ పెన్షనర్సు అసోసియేటెడ్ సభ్యులుగా వుండ వచ్చు) మరియు జీవిత కాల సభ్యత్వ రుసుము రు.250/- నుండి రు.500/- కు పెంచటం
* అనుబంధ సంఘాల (ఏ ఐ బి డి పి ఏ  ఏర్పడే నాటికే కొన్ని ప్రాంతాలలో ఉనికిలో వున్న పెన్షనర్ల సంఘాలు) రుసుము రు. 250/- నుండి రు.500/- కి పెంచటం
9. రానున్న 3 సంవత్సరాల కాలానికి ఆఫీసు బేరర్సు ఎన్నిక
10. విధానం, కార్యక్రమం తీర్మానం
11. తీర్మానాలు
12. తదుపరి 3 సంవత్సరాలకు బడ్జెట్ ప్రతిపాదనలు
13. అధ్యక్షుని అనుమతి తో ఇతర ఏ అంశమయినా

ఏ ఐ బి డి పి ఏ అఖిలా భారత అధ్యక్షులు కా.ఏ.కె.భట్టాచార్జీ, ప్రధాన కార్యదర్శి కా. కె.జయరాజ్, అడ్వైజర్ కా. వి.ఏ.ఎన్.నంబూదిరి, ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు తదితర ఆఫీస్ బేరర్సు  తో పాటు అన్నీ సర్కిల్సు నుండి సర్కిల్ సెక్రెటరీలు మరియు ఎన్నికయిన ప్రతినిధులు పాల్గొంటారు. 

No comments:

Post a Comment