ఏఐబిడీపిఏ అడ్వైజర్ కా. నంబూదిరి,
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఫైనాన్స్ మినిస్ట్రీ) లో డైరెక్టర్(ఎడ్మిన్)
శ్రీ విజయ్ సింగ్ మరియు అండర్ సెక్రెటరీ శ్రీ వివేక్ ఆశీస్ లను 24.7.2014 న కలిసి
వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపు విషయం లో డి ఓ టి 11.7.2014 న
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్(డి ఓ ఈ) కు పంపిన క్లారిఫికేషన్ లెటర్ కాపీని
అందించారు. 22.7.2014 నాటికి కూడా ఈ క్లారిఫికేషన్ తమకి రాలేదని డి ఓ ఈ అధికారులు
అన్నందున ఈ కాపీని వారికి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ కాపీ తమకి డి ఓ టి నుండి
23.7.2014 న అందిందని డి ఓ ఈ అధికారులు అన్నారు. డి ఓ టి క్లారిఫికేషన్ అందినందున
78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు అంగీకరిస్తూ వెంటనే ఆర్డర్సు ఇవ్వాలని
కా. నంబూదిరి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో చర్య తీసుకుంటామని డి ఓ ఈ అధికారులు
హామీ యిచ్చారు.
No comments:
Post a Comment