Sunday, 27 July 2014

78.2% శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపు సమస్యపై 24.7.2014 న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ ను కలిసిన కా.నంబూదిరి

ఏఐబిడీపిఏ అడ్వైజర్ కా. నంబూదిరి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఫైనాన్స్ మినిస్ట్రీ) లో డైరెక్టర్(ఎడ్మిన్) శ్రీ విజయ్ సింగ్ మరియు అండర్ సెక్రెటరీ శ్రీ వివేక్ ఆశీస్ లను 24.7.2014 న కలిసి వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపు విషయం లో డి ఓ టి 11.7.2014 న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్(డి ఓ ఈ) కు పంపిన క్లారిఫికేషన్ లెటర్ కాపీని అందించారు. 22.7.2014 నాటికి కూడా ఈ క్లారిఫికేషన్ తమకి రాలేదని డి ఓ ఈ అధికారులు అన్నందున ఈ కాపీని వారికి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ కాపీ తమకి డి ఓ టి నుండి 23.7.2014 న అందిందని డి ఓ ఈ అధికారులు అన్నారు. డి ఓ టి క్లారిఫికేషన్ అందినందున 78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు అంగీకరిస్తూ వెంటనే ఆర్డర్సు ఇవ్వాలని కా. నంబూదిరి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో చర్య తీసుకుంటామని డి ఓ ఈ అధికారులు హామీ యిచ్చారు.


No comments:

Post a Comment