ఈ నెల 29,30 తేదీలలో ఏ ఐ బి డి పి ఏ
కేంద్ర కార్యవర్గ సమావేశం కోయంబత్తూరు లో రైల్వే స్టేషన్ వద్దగల జీవన్ జ్యోతి
ఆశ్రమం లో జరుగుతుంది. బి ఎస్ ఎన్ ఎల్ లో 1.10.2000 నుండి 9.6.2013 లోగా రిటైరయిన వారందరికి 78.2% ఐ డి ఈ మెర్జర్ పై పెన్షన్
చెల్లింపు విషయం లో సాధించిన ప్రగతి మరియు ఈ విషయములో భవిష్యత్ కార్యక్రమం, బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడిన పది
నెలలలోగా అంటే 1.10.2000
నుండి
30.6.2001
వరకూ
రిటైరయిన వారి పెన్షన్ విషయం లో ఏర్పడిన అనామలీ, 1.10.2000 న ఐ డి ఏ పే ఫిక్సేషన్ సందర్భముగా సీనియర్లకు
జూనియర్లకన్నా తక్కువ పే ఫిక్సేషన్ జరిగినందున ఏర్పడిన అనామలీ, క్వార్టర్లీ మెడికల్
అలవెన్స్ పునరుద్ధరణ, 7వ పే కమిషన్ కు పెన్షనర్ల
సమస్యలపై ఇచ్చిన మెమోరాండం, బి ఎస్ ఎన్ ఎల్ ఆర్థిక
పటిష్టత, పెన్షనర్ల ఇతర సమస్యలు తదితర
ముఖ్యమయిన విషయాలపై ఈ కార్యవర్గ సమావేశం చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని
రూపొందిస్తుంది. ఈ సమావేశానికి ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత అధ్యక్షులు కా.
ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహిస్తారు. అఖిలా భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల
ఫెడరేషన్ అధ్యక్షులు కా. ఆర్. ముత్తుసుందరం సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఏ ఐ బి డి
పి ఏ అడ్వైజర్ కా. వి.ఏ.ఎన్.నంబూదిరి హాజరవుతారు. మన సర్కిల్ నుండి ఏఐబిడిపిఏ
అఖిలా భారత ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు, ఏఐబిడిపిఏ రాష్ట్ర కార్యదర్శి కా.రామచంద్రుడు
హాజరవుతున్నారు.
No comments:
Post a Comment