* 78.2% డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ చేసే విషయములో
కేబినెట్ అనుమతి కి సంబంధించి: 1.1.2007 నాటికి సర్వీసులో వున్నవారికి డి పి
ఈ గైడ్ లైన్స్ తేదీ 2.4.2009 ప్రకారం 78.2% డి ఈ మెర్జర్ అమలులోకి వచ్చింది. అందుకు
అనుగుణముగా డి ఓ టి 10.6.2013 న ప్రెసిడెన్షియల్ ఆర్డర్సు ఇచ్చింది. కాబట్టి 1.1.2007
తరువాత మరియు 10.6.2013 లోగా రిటైరయిన వారికి 78.2% డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్
చేసేందుకు కేబినెట్ అనుమతి అవసరం లేదు. కానీ 1.1.2007 కు ముందు రిటైరయిన వారికి 50%
డి ఏ మెర్జర్ అమలు కాలేదు కాబట్టి అది జరిగితేనే వారికి కూడా 78.2% డి ఏ ప్రకారం పెన్షన్
రివిజన్ సాధ్యమవుతుంది కాబట్టి అందుకు కేబినెట్ అనుమతి అవసరం అవుతుంది.
* బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు ప్రభుత్వానికి
అవుతున్న ఖర్చు : కేబినెట్ నిర్ణయం ప్రకారం డి ఓ టి లో రిటైరయిన వారికి మరియు
బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన తరువాత రిటైరయిన వారికి పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చు
విషయములో బి ఎస్ ఎన్ ఎల్/మరియు లైసెన్సు ఫీజు
మరియు బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్ను/ఎక్సైజ్ డ్యూటీ/సర్వీస్
పన్ను-వీటన్నింటి మొత్తం లో 60% వరకు మాత్రమే ప్రభుత్వము భరిస్తుంది. అంతకు మించితే మించిన భాగాన్ని
బి ఎస్ ఎన్ ఎల్ భరించాలి. డి ఓ టి పెన్షన్ ఖర్చు (డిఓటి లో రిటైరయిన వారికి మరియు బి
ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన తరువాత రిటైరయిన వారికి) 1.10.2000 నుండి 31.3.2010 వరకూ
చూస్తే ప్రతి సంవత్సరం ఈ 60% లోపే వున్నది. కానీ ఒక వంక పెన్షన్ ఖర్చు పెరిగి మరో వంకా
బి ఎస్ ఎన్ ఎల్ ఆదాయం పడిపోయినందున 2011-12
నుండి పెన్షన్ ఖర్చు ఈ 60 శాతం పరిమితిని మించిపోయింది. కానీ 1.10.2000 నుండి 31.3.2013
వరకూ ప్రభుత్వానికి పైన తెలియజేసిన అంశాల వచ్చిన మొత్తం ఆదాయం లో 60 శాతం సొమ్ము, ఇదే కాలములో అయిన పెన్షన్ ఖర్చు కన్నా ఎక్కువగానే వున్నది. అయితే ఇతర పెన్షన్
చెల్లింపులకు( 1.10.2000 తరువాత రిటైరయిన డి ఓ టి ఉద్యోగులకు చెల్లించే సి డి ఏ పెన్షన్/1.1.2004 తరువాత రిక్రూటయిన డి ఓ
టి ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం ప్రకారం పెన్షన్ కు అయ్యే ఖర్చు/వి ఎస్ ఎన్ ఎల్
పెన్షనర్ల పెన్షన్ చెల్లింపు/ఏం తి ఎన్ ఎల్ లో రిటైరయిన వారికి ప్రొ-రేటా పెన్షన్ / ఇటీవల కేబినేట్ ఆమోదించినడాని ప్రకారం ఏం టి ఎన్ ఎల్ లో రిటైరయిన వారికి రెగ్యులర్
పెన్షన్) ఎంత ఖర్చు అవుతున్నది అనే దానికి సంబంధించిన వివరాల విశ్లేషణ జరుగుతున్నది.
* పూర్వ ఉదాహరణలు:
(అ) ఆహారము మరియు వ్యవసాయ శాఖ నుండి
ఎఫ్ సి ఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లో విలీనమయిన వారికి ఐ డి ఏ పే స్కేల్సు 1.1.1997
నుండి అమలు జరిగాయి. అయితే ఈ పే రివిజన్ తేదీ నుండి పది నెలల లోగా రిటైరయిన వారికి
ఆఖరు పది నెలలలో కొన్ని నెలలు సి డి ఏ మరి కొన్ని నెలలు ఐ డి ఏ పే వున్నందున సి డి
ఏ పే కాలం లో కూడా నోషనాల్ గా ఐ డి ఏ పే తీసుకున్నట్లుగా చూపించి ఆ విధముగా పెంస్షన్
చెల్లింపులో అనామలీ లేకుండా చేయటం జరిగింది. (ఆ) 1.1.1996 నుండి 30.9.1996 వరకూ రిటైరయిన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలు నాల్గవ వేతన సంఘం పే స్కేల్సులో, కొన్ని నెలలు 5వ వేతన సంఘం పే స్కేలు లో వున్నారు. పెన్షన్ విషయములో వారికి ఏర్పడే అనామలీ ని తొలగించేందుకు
వారి ఫ్రే-రివైజ్డ్ పే ని నోషనల్ గా రివైజ్డ్ పే గా అమార్చటం జరిగింది. (ఇ) ఆర్గనైస్డ్
ఏకవుంట్స్ కేడర్ నుండి రిటైరయిన వారికి 1.1.1996 నుండి నోషనల్ గా జరిగిన పే అప్గ్రేడేషన్
ను పెన్షన్ రివిజన్ కొరకు పే గా పరిగణించటం జరిగింది.
* డి ఓ టి విజ్ఞప్తి: కాబట్టి ఈ ఉదాహరణలను దృష్టిలో
వుంచుకుని 1.1.2007 నుండి 9.9.2013 లోగా రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు నోషనల్
ఫిక్సేషన్ ప్రాతిపదికగా 78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు తనని అనుమతించాలని
డి ఓ టి, ఫైనాన్స్ మినిస్ట్రీ ని కోరింది.
1.1.2007 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు 78.2% డి ఏ మెర్జర్ అమలుకు
కేబినెట్ ఆమోదం అవసరం కాబట్టి అందుకు తగిన నోట్ ను తయారు చేసి డి ఓ టి, కేబినెట్ కు పంపిస్తుంది.
ఏ ఐ బి డి పి ఏ కృషి
ఈ లెటరు ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంటుకు 23.7.2014 న అందింది. 24.7.2014న
ఏఐబిడీపిఏ
అడ్వైజర్ కా. నంబూదిరి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఫైనాన్స్
మినిస్ట్రీ) లో డైరెక్టర్(ఎడ్మిన్) శ్రీ విజయ్ సింగ్ మరియు అండర్ సెక్రెటరీ శ్రీ
వివేక్ ఆశీస్ లను 24.7.2014 న కలిసి ఈ లెటరు కాపీని ఇచ్చి 1.1.2007 తరువాత 9.6.2013
లోగా రిటైరయిన వారికి 78.2% మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ కు వెంటనే ఆర్డర్సు ఇచ్చేందుకు
చర్య తీసుకోవాలని కోరారు. ఆర్డర్సు సాధ్యమయినంత త్వరలో ఇప్పించేందుకు ఏ ఐ బి డి పి
ఏ కృషి చేస్తున్నది. ఇదే విధముగా 1.1.2007 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు
కు కూడా 78.2% డి ఏ మెర్జరుకు కేబినెట్ అనుమతి సాధించేందుకు ఏ ఐ బి డి పి ఏ కృషి చేస్తున్నది.
No comments:
Post a Comment