Monday, 20 June 2016

78.2 శాతం డి ఏ మెర్జర్ - కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించబడిన కేబినెట్ నోట్

78.2 శాతం డి ఏ మెర్జర్ పై రివైజ్డ్ కేబినెట్ నోట్ ను 17.6.2016 న కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించినట్లు కా.నంబూదిరికి డి ఓ  టి అధికారులు తెలియజేశారు. ఆలస్యమయినప్పటికి ఇది మంచి పరిణామం. కేబినెట్ ఆమోదానికి ఇంకా ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆశించుదాం. 

Tuesday, 14 June 2016

జోహార్ కా.ఎం.పి.కున్హనందన్

ఏఐబిడిపిఏ మాజీ ట్రెజరర్ కా. ఎం.పి.కున్హనందన్ కొజికోడ్ లో ఈ రోజు (14.6.2016) మరణించారు తెలియజేయుటకు చింతిస్తున్నన్నాము. తిరుపతి లో 2,3 ఫిబ్రవరి 2016 న జరిగిన ఏఐబిడిపిఏ మహాసభలోనే అనారోగ్యం వలన తాను ఆల్ ఇండియా ట్రెజరర్ గా కొనసాగలేనని కా. కున్హనందన్ అన్నారు. ఏఐబిడిపిఏ కి, టెలికం కార్మికోద్యమానికి కా. కున్హనందన్ విశిష్టమయిన సేవలందించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. కా. కున్హనందన్ కు అరుణాంజలి సమర్పిస్తున్నాము. జోహార్ కా. కున్హనందన్! 

Monday, 13 June 2016

78.2 శాతం డి ఎ మెర్జర్- కేబినెట్ నోట్ పై సంతకం చేసిన డి ఓ టి సెక్రెటరీ- కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించేందుకు జరుగుతున్న సన్నాహం

ఈ రోజు ( 13.6.2016) ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ , డి ఓ టి లో డిడిజి   ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ తో 78.2 శాతం డి ఎ మెర్జర్ విషయం మాట్లాడారు. 

కేబినెట్ సెక్రెటేరియట్ సూచన మేరకు మార్పు చేయబడిన కేబినెట్ నోట్ ను డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ఈ రోజు ఆమోదించారని శ్రీ జైన్ తెలియజేశారు. మార్చబడిన ఈ కేబినెట్ నోట్ కు  హిందీ అనువాదం, అదనంగా పంపించాల్సిన కాపీలు తదితరాలను తయారు చేస్తున్నామని, ఈ పని అయినతరువాత కవరింగ్ లెటరు సంతకానికి డి ఓ టి సెక్రెటరీకి పంపిస్తామని, ఆ తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని శ్రీ జైన్ అన్నారు. 

ఇప్పటికే 3 సంవత్సరాలయిందని, కొంతమంది పెన్షనర్లు  ఈ బెనిఫిట్ లభించకుండానే చనిపోవటం కూడా జరిగిందని, కాబట్టి ఇంకా ఆలస్యం జరగకుండా చూడాలని కా. జయరాజ్, శ్రీ జైన్ కు విజ్ఞప్తి చేశారు. పని త్వరగాఅయ్యేందుకు సాధ్యమయినదంతా చేస్తామని శ్రీ జైన్ హామీ యిచ్చారు. 

 

Wednesday, 8 June 2016

సెక్రెటరీ డి ఓ టి ఢిల్లీలో లేనందున ఆగిన 78.2 శాతం డి ఏ ఫైలు

10.6.2013 కి ముందు రిటైరయిన వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ చెల్లింపుకు సంబంధించి కేబినెట్ సెక్రెటేరియట్ సూచన ప్రకారం మార్పు చేయబడిన ఫైలు డిఓటి సెక్రెటరీ టేబుల్ పైవున్నట్లు తెలుస్తున్నది. ఈ రోజు (8.6.2016) ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి డిఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ తోమాట్లాడేందుకు ప్రయత్నించగా వారు ఢిల్లీలో లేరని, 13.6.2016 న వస్తారని, వచ్చిన తరువాత ఫైలు పై సంతకం చేస్తారని, వారి పి ఏ తెలియజేశారు. డిఓటి సెక్రెటరీ సంతకం తరువాత ఫైలు కేబినెట్ ఆమోదానికి పంపిస్తారు. 

Wednesday, 1 June 2016

7వ వేతన సంఘం సిఫార్సులపై ప్రభుత్వ వైఖరి-పెన్షనర్లు

7వ వేతన సంఘం సిఫార్సుల అమలు పై ప్రభుత్వము కేబినెట్ సెక్రెటరీ అధ్యక్షతన సెక్రెటరీల కమిటీని నియమించింది. కానీ ఈ కమిటీ వైఖరి సానుకూలముగా లేదు. 1.1.2016 నాటి బేసిక్ పే కి 2.57 రేట్లు వుండే విధముగా కొత్త బేసిక్ పే వుండాలని 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫార్ములా సిఫార్సు చేసింది. దీని ప్రకారం 1.1.2016 నాటి పే ప్లస్ డి ఏ పై పెరుగుదల కేవలం 14.29 శాతమే వుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు 1.1.2016 నాటి బేసిక్ పే ని 3.7 రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 1.1.2016 నాటికి కేంద్ర ప్రభుత్వ గ్రూప్ డి కనీస బేసిక్ రు.7000 .కాగా దానిని 7 వ వేతన సంఘం రు.18000 చేసి (2.57 రెట్లు) అందరికీ అదే విధముగా బేసిక్ పే 2.57 రెట్లు పెరుగుదల జరిగే విధముగా ఫిట్మెంట్ ఫార్ములా (బేసిక్ X 2.57) సిఫార్సు చేసింది. కానీ ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక కనీస వేతనం రు.7000 ను రు.26000 కు పెంచి ఆ ప్రకారం బేసిక్ పే ని అందరికీ 3.7 రెట్లు పెంచాలని డిమాండ్ చేసింది. పెన్షన్ ను కూడా ఇదే విధముగా 3.7 రెట్లు పెంచాలని డిమాండ్ చేసింది.

26.5.2016 న కేబినెట్ సెక్రెటరీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ( కా. శివ గోపాల్ మిశ్రా, కా. గుమన్ సింగ్, కా.కె.కె.ఎన్.కుట్టి) కలిశారు. కేబినెట్ సెక్రెటరీ తో జరిపిన ఈ చర్చలు నిరాశాజనకముగా వున్నాయి. ప్రభుత్వము  కనీస వేతనం ను రు.18000 నుండి స్వల్పముగా పెంచేందుకు సిద్ధముగా వున్నది.  కానీ ఫిట్మెంట్ ఫార్ములాని 2.57 నుండి పెంచేందుకు సిద్ధముగా లేదు.

ఇంతేగాక 7 వ వేతన సంఘం పాత పెన్షనర్ల పెన్షన్ కొత్త పెన్షనర్లతో సమముగా వుండాలని సిఫార్సు చేసినప్పటికీ ఇందుకు అంగీకరించేందుకు ప్రభుత్వము సిద్ధముగా లేదు. ఈ సిఫార్సు అమలు చేయటం సాధ్యం కాదని, పాత పెన్షనర్ల రికార్డులు దొరకటం కష్టం కాబట్టి సాధ్యము కాదని పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అన్నట్లు కేబినెట్ సెక్రెటరీ  అన్నారు. కానీ ఇది అర్థం లేని వాదన. పెన్షనర్ల రికార్డులు సంబంధిత డిపార్ట్మెంట్సు వద్ద వుంటాయి. ఇంతే గాక పెన్షనర్ల వద్ద కూడా చాలా వరకు వుంటాయి. రికార్డులు దొరకటం కష్టమనే పేరుతో పెన్షన్ సమానతను నిరాకరించే ప్రయత్నం ను మనం ఆమోదించ కూడదు.
ప్రభుత్వ వైఖరి సానుకూలముగా లేనందున డిమాండ్స్ పై కూలంకషముగా చర్చించేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కోరారు. పాత పెన్షనర్లకు కొత్త పెన్షనర్లతో సమానత వుండాలని 7వ వేతన సంఘం సిఫార్సు చేసినా అంగీకరించకపోవటం సమంజసం కాదని ఉద్యోగుల ప్రతినిధులన్నారు. తాను ఈ విషయములో పునఃపరిశీలనకు సిద్ధమేనని, ఒక సారి పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అధికారులతో చర్చించండని కేబినెట్ సెక్రెటరీ సలహా యిచ్చారు.
3.6.2016 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీ లో సమావేశమై పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుంది.

పెన్షనర్లకు ఈ విషయాలు తెలియ జెసి అవసరమయిన సందర్భములో పోరాటానికి సంసిద్ధం చేయాలని ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్  అసోసియేషన్స్) సెక్రెటరీ జనరల్ కా. కె.కె.ఎన్.కుట్టి పిలుపునిచ్చారు. ఎన్ సి సి పి ఏ లో ఏ ఐ బి డి పి ఏ భాగస్వామి. కాబట్టి ఈ పిలుపుననుసరించి ఈ విషయాలు పెన్షనర్ల దృష్టికి తీసుకెళ్లాలి.

78.2 శాతం డి ఏ మెర్జర్ --1.6.2016 నాటి పరిస్థితి

కేబినెట్ సెక్రెటేరియట్ అడిగిన దాని ప్రకారం కేబినెట్ నోట్ లో తగు మార్పులు చేసి తుది రూపం ఇచ్చామని, 31.5.2016 నాటికి కేబినెట్ సెక్రెటేరియట్ కు తిరిగి పంపించే అవకాశం వున్నదని ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ కు  డి ఓ టి  అధికారి డి డి జి (ఎస్టాబ్లిష్మెంట్) 27.5.2016 న తెలియాజేశారు. ఫైలు డి ఓ టి సెక్రెటరీ కి చేరినట్లు తెలుస్తున్నది. ఈ రోజు (1.6.2016) డి ఓ టి సెక్రేటరీ సంతకం చేస్తే రేపు 2.6.2016న కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపే అవకాశం వున్నది.