Thursday, 21 April 2016

78.2% డి ఎ మెర్జర్- కేబినెట్ ఆమోదానికి పంపంచేందుకు తయారు చేయబడుతున్న కేబినెట్ నోట్

ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ 21.4.2016 న డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ ను కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై చర్చించారు. మంత్రి నుండి కేబినెట్ నోట్ ఫైలు తిరిగి వచ్చిందని , ఆ కేబినెట్ నోట్ కు అనుబంధంగా పంపించాల్సిన పత్రాలను ( కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం మరియు సంబంధిత డాక్యుమెంట్లుఒక్కొక్కటి 50 కాపీలు)  తయారు చేస్తున్నామని, డి ఓ టి లో వున్న పెన్షన్ సెక్షన్ ఈ పనిచేస్తున్నదని శ్రీ జైన్ అన్నారు. హిందీ అనువాదాన్ని హిందీ సెక్షన్ చేస్తున్నదని అన్నారు. 

 కేబినెట్ నోట్ తయారీ మొదటినుండీ  చూస్తున్న  డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచిస్ ఖన్నా సెలవులో వున్నారు. 28.4.2016 న జాయిన్ అవుతారు. కాబట్టి కా. జయరాజ్, ఏడిజి పెన్షన్ ను కలిసి కేబినెట్ నోట్ ను త్వరగా పంపించామని కోరారు. పని ఇప్పటికే ప్రారంభించామని, కొద్ది రోజులలో పూర్తి అవుతుందని అన్నారు. అనంతరం కా.జయరాజ్, హిందీ అధికారులను కలిశారు. హిందీ అనువాదం 25 వ తేదీ నాటికి పూర్తి కావచ్చని  వారు తెలియజేశారు. 

కాబట్టి  ఏఐబిడిపిఏ కృషి వలన కొద్ది రోజులలోనే కేబినెట్ నోట్ ను  డి ఓ టి ఆమోదానికిపంపించే పరిస్థితి ఏర్పడింది.  

Tuesday, 12 April 2016

శుభ వార్త- 78.2% డి ఏ మెర్జర్ పై నిర్ణయం ఈ నెల ఆఖరులో గా వెలువడవచ్చు


బిఎస్ ఎన్ ఎల్ ఇ యు ప్యాట్రన్ మరియు ఏఐబిడిపిఏ బి డి పి ఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి ఈ రోజు ( 12.4.2016) డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్. దీపక్ ను కలిసి పెన్షనర్సు కు 78.2% డి ఏ మెర్జర్ పై చర్చించారు. ఫైలును ఆమోదించి పంపించానని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. ఏప్రిల్ ఆఖరులోగా నిర్ణయం వస్తుందని డి ఓ టి సెక్రెటరీ అన్నారు

Sunday, 3 April 2016

8.2% డి ఏ మెర్జర్ పై డి ఓ టి సెక్రటరీతో సమావేశం


ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా.నంబూదిరి, డిఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్. దీపక్ ను 31.3.2016 న కలిసి 10.6.2013 కి ముందు రిటైరయిన పెన్షనర్సుకు 78.2% డి ఏ మెర్జర్ అమలు చాలా ఆలస్యమయిందని, వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  కేబినెట్ నోట్ తన టేబుల్ పై వున్నదని, త్వరలో పంపిస్తామని సెక్రెటరీ అన్నారు. పెన్షన్ రివిజన్ విషయంలో ఇబ్బంది కలిగిస్తున్న 60:40ఆర్డరును రద్దు చేసేందుకు తగిన చర్య తీసుకోవాలని కా. నంబూదిరి విజ్ఞప్తి చేశారు. 
78.2 శాతం డిఎ మెర్జర్ పై మార్చి నెల లో కా.నంబూదిరి డిఓటి సెక్రటరీనికలవటం ఇది రెండవ సారి. ఇంతేగాక 9.3.2016 న ఈ సమస్య పై కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ను కూడా  కా.నంబూదిరికలిశారు. 

ఈ చర్చల ఫలితంగా కేబినెట్ నోట్ ను డిఓటి సెక్రెటరీ త్వరలో మంత్రి/ కేబినెట్ ఆమోదానికి ఇంకా ఆలస్యం చేయకుండా త్వరలో పంపిస్తారని  ఆశిస్తున్నాము.