Monday, 7 March 2016

78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు 10.3.2016న ప్రదర్శనలు నిర్వహించండి

డి ఓ టి మరియు ప్రభుత్వము  78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ ను అనవసరముగా జాప్యం చేస్తున్నాయి. ఈ జాప్యానికి కారణం లేదు. ఫైలు డి ఓ టి లో ఒక డెస్క్ నుండి మరో డెస్క్ కు తిరుగుతూ వున్నది. ఫైలును కేబినెట్ ఆమోదానికి త్వరలో పంపిస్తామనే హామీలు పుష్కలముగా లభిస్తున్నాయి. కానీ ప్రతి సారి ఏదో ఒక కొత్త సందేహాన్ని లేవనెత్తి ఫైలును డి ఓ టి లోనే అటు ఇటు తిప్పుతున్నారు. ఈ వివక్షతకి అన్యాయానికి ముగింపు పలకాలి. 10.6.2013 ముందు రిటైరయిన పెన్షనర్లకు 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ వెంటనే జరగాలి. ఫిబ్రవరి 2,3 తేదీలలో తిరుపతిలో జరిగిన  ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ మార్చి 10 న ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మార్చి 10 న బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లు పెద్ద ఎత్తున బి ఎస్ ఎన్ ఎల్ జిల్లా కార్యాలయాల వద్దా జరుగు ప్రదర్శనలో పాల్గొనాలి. బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ల అసోసియేషన్ల ఫోరం కూడా అదే రోజు ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకించేందుకు, బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణకు మరియు 78.2 శాతం డి ఏ మెర్జర్ కు ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కాబట్టి పెన్షనర్లు కూడా ఈ ప్రదర్శనలలో పాల్గొని జయప్రదం చేయాలి.   

Tuesday, 1 March 2016

78.2% డి ఎ మెర్జర్


 ఈ రోజు ( 1.3.2016) జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్, ట్రెజరర్ కా. ఆర్.అరవిందాక్షన్ నాయర్ లు డిఓటి లో మెంబర్(ఫైనాన్స్) శ్రీమతిఅన్నీ మొరియాస్,  మెంబర్ ( సర్వీసెస్) శ్రీ ఎన్.కె.యాదవ్, డిడిజి( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ఎస్.కె.జైన్, డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచిస్ ఖన్నా లను కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై చర్చించారు.

మెంబర్ ( సర్వీసెస్) , డిడిజి( ఎస్టాబ్లిష్మెంట్)  మరియు డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) లు డిఓటి సెక్రటరీని కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై ఆయన అడిగిన పాయింట్ల కు వివరణయిచ్చారు. డిఓటి సెక్రెటరీ 78.2 % డిఎ  మెర్జర్ ఫైలును క్లియర్ చేసి మంత్రిగారికి పంపిస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. 
డీఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ను కా.కె.జయరాజ్ రేపు కలిసే అవకాశం వుంది.